హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ -2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఏపీ సాంకేతిక విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచింది. ర్యాంక్ హోల్డర్లందరికీ ఏపీ పాలిసెట్ ఫీజు చెల్లింపు మే 24 నుంచి, మే 27 నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మే 31నుంచి కళాశాలల ఎంపిక ఉంటుంది.
వాటికి సంబంధించిన దరఖాస్తు ఫారం appolycet.nic.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ర్యాంక్ హోల్డర్లు ఆన్లైన్ మోడ్ ద్వారా మే 24 నుంచి జూన్ 2 మధ్య ప్రాసెసింగ్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది.