హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. మంత్రి రోజాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్తో సమావేశం ముగిశాక రోజా మీడియాతో మాట్లాడారు. మంత్రి అయ్యాక తన కుటుంబంతో కలిసి ప్రగతి భవన్కు రావాలని కేసీఆర్ ఆహ్వానించారని తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశానని పేర్కొన్నారు. కేసీఆర్ తనను ఓ కూతురిగా చూస్తారని, ఆయన ఆశీర్వాదంకోసమే ప్రగతి భవన్కు వచ్చానని రోజా స్పష్టం చేశారు.