హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : ఏపీ మంత్రి అంబటి రాం బాబు లక్కీడ్రా లాటరీ టికెట్ల వివాదంలో చిక్కుకొన్నారు. సంక్రాంతి సంద ర్భంగా గుంటూరులో వైసీపీ నేతలు లక్కీడ్రా నిర్వహించారు. దానికి ‘వైఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా’ అని పేరుపెట్టి, వేలాది టోకెన్లు ముద్రించారు. అనుమతి లేకుండా లక్కీడ్రా నిర్వహించడంపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంబటిపై పిటిషన్ స్వీకరణకు పోలీసులు నిరాకరించారు. దీంతో గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు లాటరీ టికెట్ల గురించి అంబటి చేసిన ప్రచార వీడియోను జిల్లా కోర్టుకు సమర్పించారు. బహుమతుల పేరిట టికెట్లు విక్రయిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.