హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లివచ్చారు. విజయవాడ చేరుకొని రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతుండటంతో వ్యక్తిగత వైద్యులు ఈ నెల 15న ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించారు. కొవిడ్ లక్షణాలు ఉన్నట్టుగా అనుమానించి బుధవారం ప్రత్యేక విమానంలో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. వైద్యపరీక్షలు జరిపి ప్రత్యేక చికిత్స ప్రారంభించినట్టు దవాఖాన మల్టీడిసిప్లినరీ బృందం వెల్లడించింది. గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని సాయంత్రం హెల్త్ బులెటిన్లో పేర్కొన్నది.