నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పహాడిషరీఫ్ పరిధిలోని శ్రీరామకాలనీకి చెందిన వివిధ పార్టీల నాయకులు, మహిళా కార్యకర్తలు సుమారు వందకుపైగా జల్పల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ నాయకుడు యంజాల అర్జున్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కొండగడపకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్తోపాటు పలువురు నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అడ్డగూడూరులో 100 మంది కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నాయకులు.. తిరుమలగిరి మున్సిపాలిటీ, తిరుమలగిరి మండలం గుండెపురి, తాటిపాముల గ్రామానికి చెందిన 300 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, నూతనకల్ మండలం యడవెల్లికి చెందిన 50 మంది ఎమ్మెల్యే కిశోర్కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం, కురంపల్లి గ్రామాలకు చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బైరాపూర్కు చెందిన 100 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో, హనుమకొండ జిల్లా ఐనవోలులో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 100 మంది వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో పార్టీలో చేశారు.