హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఈ ఏడాది జూలై నుంచి ఇవ్వాల్సిన 4.8 శాతం డీఏ (కరువు భత్యం)ను మంజూరు చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను చెల్లించనున్నట్ట సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. దీంతో పెండింగ్లో ఉన్న మొత్తం 9 డీఏలను మంజూరు చేసినట్టయిందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని చెప్పారు.