TS Weather | తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.ఈ మేరకు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్య మహారాష్ట్ర దగ్గర ఆవర్తనం కేంద్రకృతమైందని తెలిపింది. దీనివల్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఈదురుగాలుల కారణంగా మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని పేర్కొంది
ఈ ఏడాది సమయానికై నైరుతి రుతుపవనాలు వస్తాయని స్కైమెట్ అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దక్షిణాదిపాటు పశ్చిమ, నైరుతిలోనూ సమృద్ధిగా వర్షాలు పడతాయని తెలిపింది.