హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తున్నది. ఇవాళ ఒకే రోజు 12 మందికి పాజిటివ్గా తేలింది. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20కి పెరిగింది. విదేశాల నుంచి వచ్చిన 10 మందికి పాజిటివ్గా తేలగా, రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన మరో ఇద్దరికి పాజిటివ్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల్లో గుర్తించారు. మరో వైపు దేశంలో శనివారం ఒకే రోజు 26 కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో ఎనిమిది, కర్ణాటకలో ఆరు, కేరళలో నాలుగు కేసులు రికార్డయ్యాయి.