యాదాద్రి భువనగిరి : దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ బుధవారం
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధానాలయం నిర్మాణ పనులు, లడ్డు ప్రసాద విక్రయశాలను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాద తయారీ విధానం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
ప్రసాద తయారీలో నాణ్యతా ప్రమాణాలో పాటించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ ఇంచార్జి ఈవో రామకృష్ణారావు, అధికారులు శ్రవణ్ కుమార్, భాస్కర్ శర్మ ఉన్నారు.