Anand Mahindra | హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారని, త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి కానున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో బేగరికంచె వద్ద తెలంగాణ సిల్ యూనివర్సిటీ భవనానికి సీఎం గతవారం శంకుస్థాపన చేశారు.
యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ఏటా 20వేల మందికి శిక్ష ణ ఇచ్చి, సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచే ఆరు కోర్సులు ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా సిల్ వర్సిటీని విస్తరిస్తామని పేర్కొన్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భవనంలో సిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి.