పలిమెల,డిసెంబర్7: మిరప తోటను సాగు చేసి ఆర్థికంగా ఎదుగుదామనుకున్న రైతుకు ఇప్పుడు ఆ పంట శాపంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో దాదాపు 800 ఎకరాల్లో మిరప పంటను రైతులు సాగు చేశారు. వేరుకుళ్లుతో పాటు ఇతర వ్యాధులు సంక్రమించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని సర్వాయిపేటకు చెందిన సప్పిడి రవి ఎకరం మిరప పంట పూర్తిగా చనిపోయింది. దీంతో రైతు మొత్తం మొక్కలను తొలగించాడు. పంటకు రూ.లక్ష వరకు ఖర్చు చేశానని వాపోతున్నాడు. వ్యవసాయ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.