TS Lawcet | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : న్యాయవాద కోర్సుల్లో (లా) ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ వెబ్కౌన్సెలింగ్లో అధికారులు స్వల్పమార్పులు చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలనకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 30న సీట్లు కేటాయించనున్నారు.
ఏటా లా కోర్సులకు డిమాండ్ తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పలు కాలేజీలు.. అదనపు సెక్షన్లకు అనుమతులు తెచ్చుకొన్నాయి. దీంతోపాటు హనుమకొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో 60 సీట్ల చొప్పున రెండు బీసీ గురుకుల లా కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అదనపు సెక్షన్లు, బీసీ గురుకుల కాలేజీలతో 300 పైగా సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు.