హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన బుద్ధుని విగ్రహాలు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బౌద్ధ అవశేషాల నమోదులో భాగంగా ఆదివారం అలంపూర్లోని పాపనాశేశ్వర, సూర్యనారాయణ ఆలయాల్లో మండపంపై చెక్కిన బుద్ధుని విగ్రహాలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. సూర్యనారాయణ ఆలయ రంగమండపం కప్పు మీద విష్ణు దశావతరాల్లో ఒకరుగా చెకిన బుద్ధుడు బోధివృక్షం కింద, పద్మాసనంలో ధ్యానముద్రలో ఉండగా, పైన వింజామరతో విద్యాధరుడు, ఎడమ పకన నిలబడి ఉన్న బ్రహ్మ విగ్రహాలు ఉన్నాయని వివరించారు. పునర్నిర్మించిన పాపనాశేశ్వరాలయ మహామండపం కప్పు మీద మధ్యలో కల్పవృక్షం కింద బుద్ధుడు పద్మాసనంపై ధ్యానముద్రలో కూర్చొని ఉండగా, కుడివైపున బోధివృక్షం, ఎడమ వైపున స్త్రీ శిల్పాలు ఉన్నాయని తెలిపారు. క్రీ.శ.10, 11 శతాబ్దాల్లో విజృంభించిన వైష్ణవమత ప్రచారంలో భాగంగా ఈ బుద్ధుని విగ్రహాలను విష్ణుమూర్తి అవతారంగా చెకారని, వజ్రాయన బౌద్ధంలో ఇలాంటి ప్రతిమ లక్షణం కలిగిన విగ్రహాలను అమితాభ బుద్ధుడంటారని చెప్పారు. ఈ విగ్రహాలపై మరిన్ని పరిశోధనలు జరుగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.