హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): అమెరికాయానం మరింత భారం కానున్నది. కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలు విమాన టికెట్కు రెట్టింపు చార్జీలు వసూ లు చేస్తున్నాయి. అమెరికా వెళ్లే విద్యార్థులపై ఈ ధరాభారం పడనున్నది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికాకు ఎకానమీ టికెట్ ధర రూ.60 వేలు గా ఉండేది. కానీ, ఇప్పుడు రూ.90 వేల నుంచి రూ.2.20 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. నెలాఖరులో అమెరికా వర్సిటీల్లో తరగతులు ప్రారంభం కానుండటంతో విద్యార్థి వీసాలను జారీచేస్తున్నది. చాలామందికి అమెరికా వెళ్లేందు కు సిద్ధమవుతుండటంతో విమాన టికెట్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు, సెకండ్ వేవ్ నేపథ్యంలో మన దేశం నుంచి వచ్చే విమానాలపై చాలా దేశాలు ఆంక్షలు విధించడమూ టికెట్ ధరల పెరుగుదలకు ఓ కారణమని నిపుణులు చెప్తున్నారు.