హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): నిర్దేశించిన గడువులోగా ఆయా నివేదికలను దాఖలు చేయడంలో విద్యుత్తు సంస్థలు నిర్లక్ష్యం వహిస్తే ఇకపై జరిమానా విధించేలా తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిబంధనలకు సరవణ చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలచేసింది. విద్యుత్తు సంస్థలు ఏఆర్ఆర్ లాంటివి దాదాపు 8 రకాల పిటిషన్లను ఈఆర్సీకి నిర్దేశించిన గడువులోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. కొన్ని విద్యుత్తు సంస్థలు నిర్దేశించిన గడువులోగా వీటిని దాఖలు చేయకపోవడంతో గురువారం ఈఆర్సీ నిబంధనలకు సవరణ చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ప్రకారం.. నిర్దిష్ట తేదీలోగా ఆయా పిటిషన్లను దాఖలు చేయకపోతే.. గడువు నుంచి 30 రోజుల వరకు రోజుకు రూ.5 వేల చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 30 రోజులు దాటిన తరువాత రూ.1.50 లక్షల జరిమానాతోపాటు రోజుకు రూ.10 వేల చొప్పున దాఖలు చేసేవరకు జరిమానా వసూలు చేసేలా సవరణలు ప్రతిపాదిస్తూ.. ఈఆర్సీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీచేసింది. ఈ డ్రాఫ్ట్పై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టనున్నది. ప్రజలు, సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన తరువాత గెజిట్ విడుదల చేయనున్నారు.