మహబూబాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని ముత్యాలమ్మ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ చేసిన సేవలు విశిష్టమైనవని పేర్కొన్నారు.
మనమంతా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మహానుభావుడి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్సీ నంద్యాల కోటి రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ