హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఎల్ఐసీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటానికి సిద్ధం కావాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జీ తిరుపతయ్య పిలుపునిచ్చారు.
హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఏఐఐఈఏ 72వ వార్షికోత్సవ సమావేశాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలతో పాటు వేతన సవరణ చేయక ఏడాదవుతున్నదని, సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని విమర్శించారు.