కొండపాక, జనవరి, 9 : మావోయిస్టులు బెదిరించారని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరసినగండ్ల సర్పంచ్ లక్ష్మారెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేర ఆదివారం ఓ లేఖ విడుదలైంది.
సిరిసనగండ్ల గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డిని రూ.20 లక్షలు డిమాండ్ చేశామనడం అబద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల పేరుతో లక్ష్మారెడ్డి నకిలీ లేక సృష్టించాడని జగన్ తెలిపారు. జిల్లా కమిటీ పేరుతో ఉన్న లేఖలో రాష్ట్ర కార్యదర్శి ఎలా సంతకం చేస్తారని ప్రశ్నించారు.
నకిలీ లేఖని అడ్డంపెట్టుకొని కోర్టును ఆశ్రయించాడని, పోలీసులు, లక్ష్మారెడ్డి కలిసి డ్రామాలాడుతున్నారని లేఖలో పేర్కొన్నాడు. లక్ష్మారెడ్డి ఆరోపణలను ఖండించారు.