నకిరేకల్/కేతేపల్లి/నల్లగొండరూరల్/యాదగిరిగుట్ట/భువనగిరిఅర్బన్/మోత్కూరు/కొల్లాపూర్/కోడేరు/వనపర్తి/కొడిమ్యాల, ఆగస్టు 13: బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నల్లగొండ జిల్లాలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో నకిరేకల్ మండలంలోని ఓగోడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు వార్డు సభ్యులతోపాటు 50 కుటుంబాల వారు, కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో నల్లగొండ మండలంలోని దోమలపల్లి, దోనకల్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గుండాల మండలంలోని అనంతారం, ఆత్మకూరు(ఎం) మండలంలోని తిమ్మాపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు 50 మంది, ఆలే రుకు చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ మకూద్, తుర్కపల్లి మం డలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు 200 మంది డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దొనకొండ వనితతోపాటు 30 మంది మహిళా నాయకులు బీఆర్ఎస్ నేత కుంభం అనిల్ కుమార్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో మోత్కూరు మండలంలోని ముశిపట్లకు చెందిన మాజీ ఎంపీటీసీ కొల్లూరి మల్లయ్య బీఆర్ఎస్లో చేరారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం కొత్తయాపట్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగెం శ్రీశైలం, వార్డుసభ్యుడు బొల్లెదామోదర్తోపాటు 10 మంది, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన 30 మంది, నర్సాయిపల్లి గ్రామానికి చెందిన 10 మంది, కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి గ్రామంలో జూపల్లి ముఖ్య అనుచరుడు ఎల్లేని నరసింహారావుతోసహా మరో 30 మంది నాయకులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామానికి చెందిన 55 మంది కురుమ సంఘం నాయకులు హైదరా బాద్లో మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్లో చేరారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల బీజేపీ మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఎండీ సల్మాన్.. కొడిమ్యాలకు చెందిన 70 మంది బీజేపీ యువకులతో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో ఆధ్వర్యంలో ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.