హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఇటీవల జేఈఈ మెయిన్1 ఫలితాల్లో ఆకాశ్ బైజూస్కు చెందిన 23 మంది విద్యార్థులు 99కి పైగా పర్సంటైల్ను సొంతం చేసుకొన్నట్టు సంస్థ రీజినల్ డైరెక్టర్ ధీరజ్మిశ్రా తెలిపారు.
గుంజి మణిదీప్రామ్ (99.96), బీ సిద్ధార్థ్(99.94), అల్లాడి లోహిత్కుమార్ (99.90), పూర్వీ శడగోపన్ (99.86), ఎస్ సిద్ధార్థ్ (99.66), వాసా హరీశ్ (99.65) అత్యధిక మార్కులు సాధించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు.