హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తమ కోచింగ్ సెంటర్లకు చెందిన ఏడుగురు విద్యార్థులు నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్టు ఆకాశ్ బైజూస్ కోచింగ్ సంస్థలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.
యశ్సేథి 67వ ర్యాంకు, రుమైసా జైనాబ్ ఖాన్ 158వ ర్యాంకు, త్రిశాల అర్రబెల్లి 265వ ర్యాంకు, అక్షత్ కొల్ల 318వ ర్యాంకు, భరత్ గోయల్ 324వ ర్యాంకు, యరమడ మనోప్రీత్రెడ్డి 336వ ర్యాంకు, జిల్ పటేల్ 466వ ర్యాంకు సాధించినట్టు ఆకాశ్ బైజూస్ ఎండీ ఆకాశ్చౌదరి వెల్లడించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు