హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఈనెల 9న నిర్వహించనున్నట్టు వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన మహిళా, పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 9న గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో ఈ ర్యాలీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. 9,10 తేదీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులకు, 12,13 తేదీల్లో ఏపీ పురుష అభ్యర్థులకు, 15,16 తేదీల్లో తెలంగాణకు చెందిన పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందని స్పష్టంచేశారు.
అభ్యర్థులు 2 జూలై 2005 నుంచి, 2 జనవరి 2009 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. కనీస ఎత్తు 152 సెం.మీలని, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష, మూడేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్), రెండేండ్ల ఒకేషనల్ కోర్సుల్లో (ఐటీఐ) ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని పేర్కొన్నారు. ఆయా విద్యార్హతల్లో మొత్తం మారుల్లో 50 శాతం, ఆంగ్లంలో 50 శాతం మారులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షల్లో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం https:// agnipathvayu.cdac.inను సందర్శించాలని యాకుబ్ అలీ కోరారు.