నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 30: టీఆర్ఎస్ పార్టీ కులం, మతం చూడదని.. పేదోళ్లకు మంచి చేయడమే లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రూ.200 పింఛన్ను రూ.2,016 చేశారని గుర్తుచేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం, మండల పరిధిలోని నూతన పింఛనుదారులకు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి ఆసరా పింఛన్కార్డులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడు తూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యే యంగా తెలంగాణ సర్కారు పనిచేస్తున్నదన్నారు. గత ప్రభుత్వాలు రూ.70, రూ.200 పింఛను ఇచ్చేవని.. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛను అందిస్తున్నారని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ప్రభు త్వ దవాఖానలను బలోపేతం చేశామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లోనే 70 శాతానికిపైగా ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ,కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో దవాఖానలకు వెళ్తే భరించలేని వాసన తప్ప సరైన వైద్యం అందేది కాదని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలోని ఏ ప్రభుత్వ దవాఖానకు వెళ్లినా అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సొంతజాగాలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే పథకాన్ని దసరాకు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, డాక్టర్ యాదవరెడ్డి, జడ్పీ చైర్మన్ రోజారాధాకృష్ణశర్మ పాల్గొన్నారు.
గత ప్రభుత్వాలు ఇచ్చిన రూ.200 పింఛన్ను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 2వేలకు పెం చడమే కాకుండా, రాష్ట్రంలో 50లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, వేల్పూర్, బా ల్కొండలో పింఛన్ కార్డుల పంపి ణీలో పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ మాదిరి పింఛన్లు ఇయ్యనోళ్లు ఇక్క డ ఒర్రుతుండ్రని మంత్రి మండిపడ్డారు.
ఇంటికి పెద్ద కొడుకులాగా సీఎం కేసీఆర్ అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. గరీబోళ్ల నోటికాడ ముద్ద ఆసరా పెన్షన్ అని పేర్కొన్నారు.
‘ఉచితాలు వద్దు’ అంటూ కేంద్రం మోకాలడ్డుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు నూత న పింఛన్ కార్డుల పంపిణీ చేశారు.
పేదల సంక్షేమానికే తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి, ఆత్మకూరు మండలం జూరాలలో లబ్ధిదారులకు పింఛన్ కార్డులను మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. సంక్షేమానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టంచేశారు.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పింఛ న్ల కార్డులను ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.