హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుపై గతంలో విధించిన మారటోరియాన్ని ఏఐసీటీఈ ఎత్తివేయాలని యోచిస్తున్నది. ఈ విద్యాసంవత్సరంలో కొత్త ఇంజీనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు పచ్చజెండా ఊపనున్నది. 2023-24 విద్యాసంవత్సరం అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్ను ఏఐసీటీఈ బుధవారం విడుదల చేయనున్నది.
బుధవారం నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నది. ఏప్రిల్ 6 వరకు కాలేజీలు, విద్యాసంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్కుమార్ తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీలు అధికంగా ఉండటం, సీట్లు భర్తీ కాకపోవడంతో 2019లో రెండేండ్లపాటు మారటోరియాన్ని విధించింది.