హైదరాబాద్, మే13 (నమస్తే తెలంగాణ) : యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (ఏఐబీపీ) ప్రాజెక్టులపై కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ని ర్వహించాల్సిన సమీక్షా సమావేశం మరోసారి వాయిదా పడిం ది. ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి న ఏఐబీపీని ఐదేండ్ల క్రితం ప్రధాన మంత్రి కృషి సించాయిగా పేరు మార్చారు. దేశవ్యాప్తంగా 106 ప్రాజెక్టుల పనులను ఈ ప్రోగ్రాం కింద ఎంపిక చేశారు.
డిస్ట్రిబ్యూటరీ, పిల్ల కాలువలను నిర్మించి ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు పూర్తయినా ఇప్పటికీ 46 ప్రాజెక్టుల పనులు మాత్రమే పూర్తయ్యాయి. 60 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఏఐబీపీ కింద దేవాదుల, రాజీవ్భీమా, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జల్శ క్తి శాఖ ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించాలని నిర్ణయించింది. తొలుత ఈ నెల 6న నిర్వహించాలనుకున్నా, ఆ రోజు కేఆర్ఎంబీ సమావేశం ఉన్నందున 13కు వాయిదా వేశా రు. తిరిగి శుక్రవారం సైతం సమావేశం వాయిదా పడింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.