హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయ రంగం స్వరూపం మారిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శాస్త్రవేత్తల సూచనలతో డిమాండ్ ఉన్న పం టలను యాసంగిలో సాగు చేయాలని అన్నదాతలకు సూచించారు. యాసంగి సాగు సన్నద్ధత, వానకాలం పంటల ఉత్పత్తుల అంచనాపై మంగళవారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.
మంత్రి మాట్లాడుతూ..వరిలో తక్కువ నూక వచ్చే రకాలతోపాటు మార్చి 31లోపు కోతకు వచ్చే వంగడాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రధానంగా మినుములు, పొద్దుతిరుగుడు,పప్పుశనగ, వేరుశనగ, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని..ఉల్లి, ఇతర కూరగాయల వినియోగం దృష్టిలో పెట్టుకొని యాసంగి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పప్పు పంటలను కేంద్రం 25 శాతమే కొనుగోలు చేస్తున్నదని, మొత్తం కొనాలని డిమాండ్ చేస్తూ త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నట్టు చెప్పారు.
సీఎంఆర్ గడువు పెంపు
గత ఏడాది యాసంగికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణ గడువును కేంద్రం అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగించింది. గత వానకాలం గడువు పెంపుపై మాత్రం నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ఈ సీజన్కు సంబంధించి సుమారు 20 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. వర్షాలు, రైస్మిల్లుల్లో తనిఖీల నేపథ్యంలో ఆలస్యమైంది.