కామారెడ్డి : తాడ్వాయి మండలం సంతాయిపేట వద్ద దాదాపు వందమందికిపైగా వాగులో చిక్కుకుపోయారు. మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షానికి భీమేశ్వర వాగులో వరద ప్రవాహం పెరిగింది. దీంతో రైతులు, కూలీలు వాగు ఆవతల వైపు చిక్కుకుపోయారు. వాగు దాటేందుకు ప్రయత్నించినా ఉధృతంగా ప్రవహిస్తున్నది. గత రెండు మూడు గంటలుగా రైతులు వాగు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహాయంతో వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.