హిమాయత్నగర్, జూన్ 26: దేశ భద్రతకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలా ఉన్న ‘అగ్నిపథ్ స్కీం’ను తక్షణమే రద్దు చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జూలై 2, 3న నగరంలో నిర్వహించే బీజేపీ జాతీయ సమావేశాల వద్ద ప్రజలతో కలిసి నల్ల జెండాలు చేబూని నిరసన ప్రకటిస్తామని తెలిపారు. ఆదివారం నగరంలోని హిమాయత్నగర్లో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైనికుల శక్తి, దేశభక్తిని నిర్యీర్యం చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అగ్నిపథ్ స్కీంపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలని ఆయన ప్రజలకు కోరారు. సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్ వసంత్రావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సతీశ్కుమార్, గ్రేటర్ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్,అధికార ప్రతినిధి శ్రీనివాస్, డీబీఎస్ఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇటికాల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.