మెదక్ అర్బన్, జూలై 20 : ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ పనులకు అనుమతులు వెంటనే నిలిపి వేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట మనోహరాబాద్ మండల వాసులతో కలిసి ధర్నా చేశారు.
కంపెనీ నుంచి వస్తున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్ర భుత్వం ఫ్యాక్టరీని మూసేసేవరకు ప్రజలకు బీఆర్ఎస్ మద్దతునిస్తుందని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టి ఫ్యాక్టరీ విస్తరణపై ప్రజలు తమ అభిప్రాయలు తెలుపకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అనంతరం గేట్ వద్దకు డీఆర్ఎస్ అంబదాస్ రాజేశ్వర్ వచ్చి వినతి పత్రం తీసుకున్నారు.