హైదరాబాద్, జనవరి 15 (నమస్తేతెలంగాణ): సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని, లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్డ్రా చేసుకున్నామని కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పీల్ చేసుకునేందుకు అవకాశం తమకు ఉన్నదని తెలిపారు.
ఫార్ములా ఈ-కార్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపిందని పేర్కొన్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఆర్యమ సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారని చెప్పారు. ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించినట్టు తెలిపారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేరొన్న అంశాలు ప్రొసీజర్లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించిన అంశాలుగా పేర్కొన్నట్టు వెల్లడించారు.