హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): భూ సమస్యల పరిషారం కోసం టీ-శాట్ నిపుణ ఛానల్లో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. బుధవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భూ రికార్డులపై అవగాహన కలిగిన న్యాయ నిపుణులు భూమి సునిల్కుమార్ భూ సమస్యలపై సలహాలు, సూచనలు అందజేస్తారని తెలిపారు. సలహాలు పొందాలనుకునేవారు 040-23540326, 23450726 నంబర్ల ద్వారా కానీ, టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4039 ద్వారా కానీ సంప్రదించాలని సూచించారు.