వరంగల్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రధాని మోదీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్పై ప్రకటన చేసిన తర్వాతే వరంగల్ పర్యటనకు రావాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ జిల్లా కాజీపేటలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి దాస్యం మాట్లాడారు. వ్యాగన్ తయారీ యూనిట్కు ఇప్పటికీ డీపీఆర్ లేదని, కేంద్ర క్యాబినెట్ ఆమోదం లేదని, రైల్వే శాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఎందుకు చేర్పాటు చేసిందని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు సిగ్గు ఉంటే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగు గిరిజన వర్సిటీపై ప్రధానితో స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ ఏర్పాటుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. బీజేపీకి విజన్ లేదని అన్నారు.