హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ మే 18కి వాయి దా పడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మ్మోహన్రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర నేతృత్వంలో న్యూఢిల్లీలో బుధవారం ప్రారంభమైన విచారణ గురువారం సైతం కొనసాగింది. ఏపీ దాఖలు చేసిన రిజాయిండర్కు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని తెలంగాణకు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్ సూచించారు.