మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలం అయోధ్య శివారు భజన తండాలో 30 మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి సోమవారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారందరికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా నిర్మించిన పార్టీ జెండా గద్దెను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయిని రంజిత్, సూదగని మురళి, యాస వెంకట్ రెడ్డి, అశోక్, నర్సింగ్ వెంకన్న, పార్టీ ముఖ్య కార్యకర్త సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.