హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఈ విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ మహిళా వర్సిటీలో రెండు పీజీ కోర్సులను ప్రవేశపెట్టాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఎమ్మెస్సీ ఫుడ్సైన్స్, ఎమ్మెల్సీ డాటాసైన్స్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు. సీపీగెట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీలో ఈ ఏడాది నుంచి బీబీఏ హెల్త్కేర్, బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ, బీఏ గేమింగ్ వంటి కోర్సులను సెక్టార్ స్కిల్ కౌన్సిల్లో భాగంగా ప్రవేశపెట్టారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) కోర్సును నిరుడు ప్రవేశపెట్టగా, ఇందులోని సీట్లు హాట్కేకులను తలపిస్తున్నాయి. 120 మంది విద్యార్థులతో రెండు బ్యాచ్లను ప్రారంభించినా సీట్లు పూర్తిగా నిండాయి.
కోఠి మహిళా కాలేజీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు సెప్టెంబర్లో అంకురార్పణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు బుధవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. యూనివర్సిటీ యాక్ట్ను కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు చొరవ తీసుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.