హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): శ్రీచైతన్య విద్యాసం స్థల బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీలను ఎంపిక చేసినట్టు విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ శనివారం ఒక ప్రక టనలో తెలిపారు. 39 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన తమ విద్యాసంస్థ విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన బోధనా పద్ధతులతో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అనితర సాధ్యమైన అనేక అత్యున్నత ర్యాంకులు తమ సంస్థ విద్యార్థులు సాధించారని తెలిపారు. తమ విద్యాసంస్థలు మరిన్ని కొత్త మైలురాళ్లను అధిగమించేందుకు శ్రీలీల సమగ్ర పాత్ర పోషిస్తారన్న విశ్వాసం ఉన్నదని పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీచైతన్య విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్గా తనను ఎంపిక చేయడంపై శ్రీలీల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థలనే ఎంచుకోవాల్సిందిగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు ఆమె సూచించారు.