రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో సినీ నటి నవీనారెడ్డి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నవీనారెడ్డి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతికి మేలు చేయాలన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్కు నవీనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం డైరెక్టర్ సుకుమార్, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, చిరంజీవి సతీమణి సురేఖకు నవీనారెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.