హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్ను మంత్రి హరీశ్రావు అరణ్యభవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘానికి భవనం ఏర్పాటుకు సహకరించాలని, సీఎంవోలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గ్రేడ్-1 డీఏల అప్గ్రేడేషన్ ఫైల్ క్లియర్ చేయించాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంఘం భవన ఏర్పాటుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఫైల్ క్లియర్ అయ్యేలా చూస్తానని, ఇతర అంశాలను సైతం పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ మొహియుద్దీన్, ప్రధాన కార్యదర్శి రాధా రమణారెడ్డి, కొశాధికారి హాషం, ఉపాధ్యక్షుడు శౌఖత్ హుస్సైన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకట రమణ, సీనియర్ నాయకులు దేవ్ సింగ్, రమేశ్ కుమార్, కవిత, ఖాజా, రాధాకృష్ణ, మూర్తి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.