నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 19 : తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. నిజామాబాద్కు చెందిన కోనేటి విజయ్ కుమార్ తన కారును డీపీఆర్వో కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. ఈ కారును డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ సీ వేణి ప్రసన్న వినియోగిస్తున్నారు.
అందుకు ప్రతి నెలా రూ.33 వేల అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. మూడు నెలలుగా బిల్లు రావడం లేదు. తనకు రావాల్సిన రూ.99 వేలు మంజూరు అయ్యేలా చూడాలని విజయ్కుమార్.. వేణి ప్రసన్నను కోరారు. ఇందుకోసం లంచం డిమాండ్ చేసింది. వేణి ప్రసన్న గురువారం తన కార్యాలయం లో విజయ్కుమార్ నుంచి రూ.9 వేలు లంచం తీసుకుంటుండగా ఇన్చార్జి డీఎస్పీ ఆనం ద్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సదరు అధికారిపై కేసు నమోదు చేసి, కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.