బంజారాహిల్స్, అక్టోబర్ 7: పబ్ నిర్వాహకుల నుంచి భారీగా లంచం డిమాండ్ చేస్తున్న ట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారాహి ల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్రెడ్డి, హోం గార్డు శ్రీహరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్లోని రాక్వెల్ స్కైలాంజ్ పబ్ నిర్వాహకుడు లక్ష్మణ్రావు ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, శుక్రవారం ఉదయం 11 నుంచి శనివారం 9 గంటల దాకా బంజారాహిల్స్ ఠాణాలోనే విచారణ చేపట్టారు. సుమారు 22 గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. పబ్ నిర్వాహకులపై నమోదైన పిటా కేసుకు సంబంధించిన వివరాలు, గత నెల 30న అర్ధరాత్రి పబ్ వద్ద నుంచి నిర్వాహకుడిని ఠాణాకు తీసుకెళ్లడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇన్స్పెక్టర్, ఎస్సై, హోంగార్డు వాట్సాప్ కాల్స్ వివరాలు సేకరించారు. పబ్ నిర్వాహకుడిని ఠాణాకు పిలిపించి, నిందితులతో మాట్లాడిన విషయాల గురించి ఆరా తీశారు. ఉదయం 11 గంటలకు ఏసీబీ కార్యాలయంలో ముగ్గురు నిందితులకు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. 9న విచారణకు రావాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. కాగా, ఆది నుంచి వివాదాస్పదుడైన హోంగార్డు శ్రీహరి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించాడని తేలింది.
ఆలేరు రూరల్, అక్టోబర్ 7 : కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేటలో కాంట్రాక్టర్ శ్రీశైలం 16 లక్షలతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులు చేపట్టారు. లంచం కింద 5% వాటా ఇవ్వాలని పంచాయతీరాజ్ ఏఈ రమేశ్ డిమాండ్ చేశాడు. ఇందుకోసం గత రెండు నెలలుగా ఎంబీ రికార్డు చేయకుండా తిప్పుతున్నాడు. ఒప్పందం మేరకు కాంట్రాక్టర్ శ్రీశైలం శనివారం ఏఈ రమేశ్కు రూ.80 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.