హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగా ణ): లంచాల పే రుతో ప్రజలను పీడిస్తే కఠిన చర్య లు తప్పవని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. పేదలను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడనేది పనికిమాలిన చర్య అని గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇటీవల నారాయణగూడకు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కథనాన్ని ‘హైదరాబాద్ వైబ్’ అనే నెటిజన్ సీవీ ఆనంద్కు ట్యాగ్చేశారు. అన్నిశాఖల అధికారులు డబ్బుల కోసం సామాన్యులను వేధిస్తున్నారని, లంచాలతో ప్రజ లు విసిగి వేసారిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.