తాండూరు, డిసెంబర్ 5: భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం సబ్రిజిస్ట్రార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. యాలాల మండలం దౌలాపూర్కు చెందిన హీర్యా నాయక్ మూ డేండ్ల క్రితం తాండూరుకు చెందిన ఈర్షద్ వద్ద భూమి పత్రాలను తనఖా పెట్టి రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నా డు.
ఇటీవల హీర్యానాయక్ సదరు మొత్తాన్ని ఈర్షద్కు చెల్లించాడు. భూమి ఈర్షద్ పేరుపైనే ఉండటంతో రద్దు చేసేందుకు సబ్రిజిస్ట్రార్ను ఆశ్రయించారు. భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం సబ్రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేశాడు. మొదటి విడత కింద సోమవారం రూ.50 వేలు ఇస్తానని ఈర్షద్ చెప్పగా సబ్రిజిస్ట్రార్ తరఫున మధ్యవర్తి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.