హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ ఫలితాల్లో తెలంగాణ గురుకులాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మొత్తంగా 162 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాం కులు సాధించారు.
వీరందరికీ మెడిసిన్లో సీట్లు వచ్చే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు. జీ అభిషేక్ ఎస్సీ క్యాటగిరీలో ఆలిండియా 912 ర్యాంక్, శ్రీజ ఎస్సీ క్యాటగిరీలో ఆలిండియా 4,723 ర్యాంక్ కైవసం చేసుకున్నారు. కృష్ణ, సాయికుమార్, ఉమ మెరుగైన ర్యాంకులు సాధించారు. ఈ విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ శుభాకాంక్షలు తెలిపారు.