Karimnagar | హైదరాబాద్ : కరీంనగర్ మాతాశిశు కేంద్రం నుంచి అపహరణకు గురైన శిశువు కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. మూడు రోజుల పసికందును ఎత్తుకెళ్లారని ఆ పాప పేరెంట్స్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు కిడ్నాపర్తో పాటు పసికందును పెద్దపల్లి జిల్లాలో పట్టుకున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు చోటు చేసుకున్న ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు… పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో కిడ్నాపర్ను పట్టుకొని బిడ్డను తల్లి చెంతకు చేర్చారు. బాధిత కుటుంబానికి చెందిన పదేళ్ల బాలుడిని మచ్చిక చేసుకున్న మహిళా కిడ్నాపర్ … శిశువును ఎత్తుకెళ్లింది. ఎవరికీ అనుమానం రాకుండా బాలుడిని తన వెంట తిప్పుకుని ఆస్పత్రి ఆవరణలోనే కొద్ది సేపు సంచరించింది. ఆ తర్వాత బస్టాండ్కు చేరుకొని అక్కడి నుంచి జమ్మికుంటకు వెళ్లింది. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోని ఓ గ్రామానికి చేరుకుంది. పోలీసులు అక్కడి నుంచి కరీంనగర్కు తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. దీంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.