దస్తురాబాద్, నవంబర్ 16 : విద్యావంతులు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చు లో పడుతున్నారు. అన్నీ తెలిసినా అవ తలి వ్యక్తుల మాటలకు ఆకర్షితులై మోసపోతున్నారు. ఆన్లైన్ వ్యాపారమంటూ ఓ యాప్ ద్వారా ఓ యువతి నుంచి రూ.4లక్షలు కొట్టేసిన ఘటన ఇది. నిర్మ ల్ జిల్లా దస్తురాబాద్ మండలం మున్యాలకు చెందిన యువతి 2020లో డిగ్రీ పూర్తిచేసింది. ఉద్యోగావకాశాల కో సం ఎదురుచూస్తున్నది. గత నెల 18న తన మొబైల్లో అప్నాజాబ్ సెర్చ్, అలర్ట్ అనే యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొన్నది. తన బయోడేటాను అందులో అప్లోడ్ చేసింది. ఆన్లైన్ వ్యాపారం(జాబ్) గురించి ఆమె ఫోన్కు 919753751178 నంబర్ వచ్చింది.
ఈ నంబర్కు డయల్ చేయగా వాట్సాప్ ద్వారా లింక్ పంపించారు. అది ఓపెన్ చేయగా ఫ్లిప్కార్ట్ మాల్ పార్ట్టైం జాబ్ అని వచ్చింది. ఇం దులో జాబ్ చేయాలంటే డబ్బులు జమ చేయాలని చెప్పారు. అక్టోబర్ 25 నుంచి ఫ్లిప్కార్ట్ మాల్లో 56 సార్లు విడతల వారీగా మొత్తం రూ.3,97,700ను బదిలీ చేసింది. మొదటిసారిగా యువతికి రూ. 925 వచ్చాయి. తర్వాత యువతి దగ్గర నుంచి డబ్బులు కట్టించుకొని విత్డ్రా పర్మిషన్ ఇవ్వలేదు. ఇదే చివరి టాస్క్ అని చెప్తూనే డబ్బులను కొల్లగొట్టారు. అనుమానం వచ్చి యూ ట్యూబ్లో వెతకగా ఆ యాప్ ఫేక్ అని తేలింది. వెంటనే ఆ యువతి దస్తురాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.