Telangana | పర్వతగిరి, మార్చి 16: ఓ యువకుడు ప ట్టుదలతో చదివి నాలు గు ఉద్యోగాలకు ఎంపిక య్యాడు. వరంగల్ జి ల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన కంటెం సంతోష్ బీటెక్ పూర్తి చేశాడు. ఆ యువకుడు బ్యాంకు ఉద్యోగ ఎంపిక పరీక్షలకు కసితో చదివాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే యూట్యూబ్ క్లాస్లు విని పరీక్షలు రాశాడు. ఫలితంగా నిరుడు డిసెంబర్లో వరంగల్ డీసీసీబీ బ్యాంకులో క్లర్క్ పోస్టుకు అర్హత సాధించిన సంతోష్, జనవరి 1న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (ఎస్బీఐ స్పాన్సర్డ్)లో స్కేల్-1 అధికారిగా ఎంపికయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ (ఎస్బీఐ స్పాన్సర్డ్)లో క్లర్క్ పోస్టుకూ అర్హత సాధించాడు. మార్చి 10న వచ్చిన ఫలితాల్లో ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ పోస్టుకూ క్వాలిఫై అయ్యాడు. ఇలా వరుసగా వచ్చిన ఫలితాల్లో నాలుగు ఉద్యోగాలకు ఎంపికై నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. మరో విశేషమేమిటంటే ఆయన రాసిన మరో రెండు ఉద్యోగాల ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో సంతోష్ ఎంపిక పట్ల స్నేహితులు, బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.