కాజీపేట, డిసెంబర్ 14: తనను నమ్మి చిట్టీలు వేసుకున్న సభ్యులకు కుచ్చుటోపీ పెట్టి దాదాపు రూ.6 కోట్ల నగదుతో పరారైంది ఓ మహిళ. హనుమకొండ జిల్లా కాజీపేట పట్ట ణంలోని ప్రశాంత్నగర్కు చెందిన శ్రీదేవి.. కొన్నేండ్లుగా చిట్టీలు నడుపుతున్నది. పలువురు కాలనీవాసులు పిల్లల చదువులు, పెండ్లిళ్ల్లు, ఇండ్ల నిర్మాణం పేరిట ఆమె వద్ద చిట్టీలు కట్టారు. చిట్టీలు వేసిన సభ్యులు వాటిని ఎత్తుకుని.. అధిక వడ్డీ వస్తుందని ఆశపడి ఆ డబ్బులను ఆమెకే అప్పుగా ఇచ్చారు. చాలా మంది వచ్చిన వడ్డీతో ఆమె వద్దనే నెల నెలా చిట్టీల వాయిదా చెల్లిస్తుండేవారు.
డబ్బుల విషయంలో నిక్కచ్చిగా ఉంటుందనే నమ్మకంతో చాలామంది తమ బంధువులు, మిత్రుల వద్ద తక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకుని శ్రీదేవికి ఇచ్చి ఆమె నుంచి అధిక వడ్డీ పొందుతుండేవారు. నెల రోజులుగా శ్రీదేవి కనిపించకపోవడంతో బాధితులు విషయాన్ని ఆరా తీయగా.. ముల్లేమూటా సర్దుకుని హైదరాబాద్కు వెళ్లిపోయిందని తెలిసింది. బాధితులందరూ.. శ్రీదేవి కుటుంబ సభ్యులను అడగగా.. ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చేసేదిలేక లబోదిబోమంటూ కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.