యాదాద్రి భువనగిరి : జిల్లాలోని గుండాల మండల తహసీల్దార్ దయాకర్ రెడ్డి.. ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అనంతరం తహసీల్దార్ దయాకర్ రెడ్డిని సీసీఎల్ఏ హైదరాబాద్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు.