ఇబ్రహీంపట్నం, మార్చి 19: ఓ మహిళ తన మాజీ భర్తపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్దండి గ్రామానికి చెందిన నీరటి మహేశ్కు ఎనిమిదేండ్ల క్రితం మెట్పల్లి మండలం జగ్గసాగర్కు చెందిన మాస లక్షణతో వివాహం కాగా, వీరికి కూతురు ఉన్నది. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో 11 అక్టోబర్ 2023లో కోర్టు నుంచి విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నారు.
అయితే మహేశ్కు ఈ నెల 20న వేరే అమ్మాయితో వివాహం జరగాల్సి ఉన్నది. ఈ క్రమంలో లక్షణ మంగళవారం ఉదయం మహేశ్ ఇంటికెళ్లింది. మహేశ్ బయటికి రాగానే లక్షణ తనవెంట తెచ్చుకున్న యాసిడ్తో దాడి చేసింది. ఈ ప్రమాదంలో మహేశ్కు ఎడమ కన్నుభాగం, వీపుపై గాయాలయ్యాయి. మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.