రాయ్పూర్, జూలై 3: తన కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నందుకు ఒక గిరిజన మహిళకు నిప్పటించారు. రాంప్యారీ బాయి అనే ఆ మహిళ ప్రస్తుతం దవాఖానలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. ఈ దారుణ ఘటన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. ధనోరియా గ్రామ పొలంలో మహిళకు నిప్పంటించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను నిందితులు చిత్రీకరించారా లేక దారినపోయే వారు తీశారా అనే దానిపై స్పష్టత లేదు. నిందితుల నుంచి ముప్పు ఉన్నదని, రక్షణ ఇవ్వాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు.